– స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు : పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
నవతెలంగాణ-కంఠేశ్వర్
తెలంగాణలో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్లో భాగం పంచుకున్న ప్రతి ఒక్కరూ జైలుకు వెళ్లడం ఖాయమని పీసీసీ చీఫ్ మహేష్కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథి గృహం వద్ద విలేకరులతో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుతో కోట్ల రూపాయలు నీళ్లల్లో పోసి నాసిరకం పనులు చేశారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల విషయంలో కీలకమైన బనకచర్ల విషయంలో వెనక్కి తగ్గేదేలేదన్నారు. నాయకులు, పారిశ్రామిక వేత్తలు, జడ్జీలు, సినీతారలు, బడా నాయకుల ఫోన్లు 650 ట్యాప్ చేసిన నీచమైన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదేనని విమర్శించారు. ట్యాప్ అయిన 650 మంది పేర్లు బహిర్గతం చేయాలని ప్రభుత్వాన్ని, సిట్ను కోరారు. ట్యాప్ అయిన వారంతా స్వచ్ఛందంగా విచారణకు హాజరు కావాలన్నారు. కేసీఆర్, కేటీఆర్ ప్రమేయంతోనే ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు భావిస్తున్నామని తెలిపారు. దేశ చరిత్రలోనే అతి పెద్ద నేరం ఫోన్ ట్యాపింగ్ అని, అందులో భాగం పంచుకున్న ప్రతి ఒక్కరూ జైలుకు వెళ్లడం ఖాయమని వివరించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ సలహదారులు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ విచారణపై నమ్మకం లేదన్న కేంద్ర మంత్రి బండి సంజరు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సిట్ విచారణపై నమ్మకం లేదన్న బండి వ్యాఖ్యలు బాధ్యతా రాహిత్యమన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఇలాంటి వ్యాఖ్యలు ఆయన అవివేకానికి నిదర్శనమని తెలిపారు.సిట్పై అభ్యంతరాలు ఉంటే ముందుగా సహకరించాలని కోరారు.
ఫోన్ ట్యాపింగ్ నిందితులంతా జైలుకే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES