Tuesday, August 12, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంసంభాల్‌ మసీదు స‌ర్వేకు అడ్వ‌కేట్ క‌మిష‌న‌ర్..స‌మ‌ర్థించిన అలహాబాద్‌ హైకోర్టు

సంభాల్‌ మసీదు స‌ర్వేకు అడ్వ‌కేట్ క‌మిష‌న‌ర్..స‌మ‌ర్థించిన అలహాబాద్‌ హైకోర్టు

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: సంభాల్‌ మసీదును సర్వే చేయడానికి అడ్వకేట్‌ కమిషనర్‌ను నియమించాలంటూ ట్రయల్‌ కోర్టు ఇచ్చిన ఆదేశాలను అలహాబాద్‌ హైకోర్టు సోమవారం సమర్థించింది. గతేడాది నవంబర్‌లో ట్రయల్‌ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. కమిషనర్‌ను నియమించాలని ఆదేశించడంతో, దావా కొనసాగించదగినదిగా మారిందని కోర్టు పేర్కొంది.

మసీదు కమిటీ, వాది హరిశంకర్‌ జైన్‌ వ్యాజ్యం ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (ఎఎస్‌ఐ) తరపున వాదనలు విన్న అనంతరం జస్టిస్‌ రోహిత్‌ రంజన్‌ అగర్వాల్‌ గతంలో ఈ అంశంపై తీర్పును రిజర్వ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ దావాను, అడ్వకేట్‌ కమిషనర్‌ను నియమించాలన్న సంభాల్‌ కోర్టు ఉత్తర్వును సవాలు చేస్తూ షాహిజామా మసీదు కమిటీ హైకోర్టును ఆశ్రయించింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img