- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: బోయిన్పల్లిలోని మేధా పాఠశాలలో గుట్టుగా అల్ప్రాజోలం తయారీ చేస్తోన్న ఘటన వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తాజాగా మేధా పాఠశాలకు ఉన్న అనుమతులను విద్యాశాఖ రద్దు చేసింది. ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను ఇతర స్కూళ్లలో చేర్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
- Advertisement -