Wednesday, February 11, 2026
E-PAPER
Homeబీజినెస్స్టీల్ మంత్రిత్వ శాఖ నుండి గ్రీన్ స్టీల్ సర్టిఫికేషన్ పొందిన ఏఎం/ఎన్ఎస్ ఇండియా

స్టీల్ మంత్రిత్వ శాఖ నుండి గ్రీన్ స్టీల్ సర్టిఫికేషన్ పొందిన ఏఎం/ఎన్ఎస్ ఇండియా

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : స్టీల్ మంత్రిత్వ శాఖ యొక్క కొత్త గ్రీన్ స్టీల్ టాక్సానమీ కింద గ్రీన్ స్టీల్ సర్టిఫి కేషన్ పొందిన దేశంలో మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ స్టీల్ ఉత్పత్తిదారుగా ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా (ఎఎం/ఎన్ఎస్ ఇండియా) నిలిచింది. (ఎఎం/ఎన్ఎస్ ఇండియా) ఇండియా హాట్ రోల్డ్ (హెచ్ఆర్) కాయిల్స్, షీట్స్ నాలుగు-స్టార్ రేటింగ్‌ను సాధించాయి. కోల్డ్ రోల్డ్ (సీఆర్) కాయిల్స్, షీట్స్ మూడు-స్టార్ రేటింగ్‌ను సాధిం చాయి.

ఈ ఉత్పత్తులు – ఆటోమోటివ్, మౌలిక సదుపాయాలు, రక్షణ, నిర్మాణ పరికరాలు, వినియోగదారు   వస్తువుల రంగాలకు కీలకమైనవి – ఇప్పుడు అధికారికంగా ప్రభుత్వ-ధృవీకృత గ్రీన్ స్టీల్‌గా గుర్తించబడ్డాయి. దీని వలన వినియోగదారులు తమ విలువ గొలుసు (వాల్యూ చెయిన్)లలో స్కోప్ 3 ఉద్గారాలను తగ్గించుకోవచ్చు.

ప్రతి టన్ను ఫినిష్డ్ ఉక్కుకు 2.2 టన్నుల కంటే తక్కువ CO₂ సమానమైన అర్హత పరిమితి (tCO₂e/tfs)తో ఉక్కు ఉత్పత్తి ఉద్గారాల తీవ్రత ఆధారంగా సర్టిఫికేషన్‌కు అర్హత ఉంటుంది. ఈ పరిమితి కంటే తక్కువ ఉద్గారాలతో ఉత్పత్తి చేయబడిన ఉక్కును మూడు-స్థాయిల వ్యవస్థ కింద రేట్ చేస్తారు: త్రీ-స్టార్, ఫోర్-స్టార్ లేదా ఫైవ్-స్టార్ గ్రీన్ స్టీల్.

సర్టిఫికేషన్ సాధించడానికి, ఎఎం/ఎన్ఎస్ ఇండియా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సెకండరీ స్టీల్ టెక్నాలజీ (NISST) ద్వారా కఠినమైన ఆడిట్‌ను నిర్వహించింది. ఇది కంపెనీ ఫ్లాగ్‌షిప్ ఫ్లాట్ స్టీల్ పోర్ట్‌ఫోలియో, గ్రీన్ స్టీల్ ప్రమాణాలకు అనుగుణంగా ఉందని నిర్ధారించింది.

ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా (ఎఎం/ఎన్ఎస్ ఇండియా) సీఈఓ శ్రీ దిలీప్ ఊమెన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘భారతదేశ గ్రీన్ స్టీల్ టాక్సానమీ ఉక్కు పరిశ్రమ భవిష్యత్తు, దాని డీకార్బనైజేషన్‌కు స్పష్టమైన దిశను నిర్దేశిస్తుంది. ఏఎం /ఎన్ఎస్ ఇండియా తన కార్బన్ ఉనికి తగ్గించడానికి గట్టి ప్రయత్నాలతో లో- కార్బన్ స్టీల్‌ను తయారు చేస్తోంది. కొత్త ఫ్రేమ్‌వర్క్ ఈ నిబద్ధతకు మరింత మద్దతు ఇస్తుంది. తాజా సర్టిఫికేషన్ ఈ ప్రయా ణంలో మా పురోగతిని ప్రతిబింబిస్తుంది. లో- కార్బన్ ప్రక్రియలు, క్లీన్ ఎనర్జీలో దృష్టి సారించిన పెట్టుబడుల ద్వారా ఇది ఆధారపడి ఉంటుంది. ఈ గుర్తింపు మా బ్రాండ్ వాగ్దానమైన – ‘స్మార్టర్ స్టీల్స్, బ్రైటర్ ఫ్యూచర్స్’ను అందించడంపై మా దృష్టిని ప్రదర్శిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వాన్ని కొనసాగిస్తూనే జాతీయ వాతావరణ లక్ష్యాలకు మద్దతు ఇవ్వడంలో ఉక్కు తయారీదారులు పోషిస్తున్న ముఖ్యమైన పాత్రను కూడా ఈ అభివృద్ధి బలోపేతం చేస్తుంది’’ అని అన్నారు.

ఎఎం/ఎన్ఎస్ ఇండియా తన ఫ్లాట్ స్టీల్స్ కోసం గ్రీన్ స్టీల్ సర్టిఫికేషన్‌ను పొందగల సామర్థ్యం తనకు గల నిర్మాణాత్మక లో-కార్బన్ ఉత్పత్తి ప్రొఫైల్‌ను ప్రతిబింబిస్తుంది. కంపెనీ ఉక్కు తయారీ సామర్థ్యంలో దాదాపు 65% సహజ వాయువును ఉపయోగించి డైరెక్ట్ రిడ్యూస్డ్ ఐరన్ (DRI) మార్గంపై ఆధారపడి ఉంది. ఇది బొగ్గు ఆధారిత ప్రక్రియలపై ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఇది 2015 నుండి కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాల తీవ్రతలో 35% కంటే ఎక్కువ తగ్గింపుకు మద్దతు ఇచ్చింది.

ఏఎం గ్రీన్ ఎనర్జీ అభివృద్ధి చేసిన ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో దాదాపు 1 GW హైబ్రిడ్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్ట్ నుండి సరఫరా చేయబడిన విద్యుత్‌తో సహా పునరుత్పాదక ఇంధనం ఏకీకరణ ద్వారా కంపెనీ ఉద్గారాల పనితీరు మరింత బలపడింది. ఈ ప్రాజెక్ట్ 2025లో గుజరాత్‌లోని ఎఎం/ఎన్ఎస్ ఇండియా ఫ్లాగ్‌షిప్ హజీరా ప్లాంట్‌కు క్లీన్ పవర్ సరఫరా చేయడం ప్రారంభించింది.

డిసెంబర్ 2025లో, ఆర్సెలర్ మిట్టల్ మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్‌లోని మూడు అదనపు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులలో సుమారు USD 0.9 బిలియన్లను పెట్టుబడి పెట్టాలని ప్రణాళికలు ప్రకటించింది. ఈ కేంద్రాల నుండి విద్యుత్తును ఏఎం /ఎన్ఎస్ ఇండియాకు సరఫరా చేస్తారు. పూర్తయిన తర్వాత ఈ ప్రాజెక్టులు, భారత దేశంలో ఆర్సెలర్ మిట్టల్ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని 2 GWకి రెట్టింపు చేస్తాయి.

సమాంతరంగా, ఎఎం/ఎన్ఎస్ ఇండియా గుజరాత్‌లోని భచౌలో 550-MW హైబ్రిడ్ పునరుత్పాదక ఇంధన ప్రా జెక్టును అభివృద్ధి చేస్తోంది. ఇందులో 300 MW సౌరశక్తి, 250 MW పవన శక్తి ఉన్నాయి. దీనితో వార్షిక CO₂ ఆదా 0.9 మిలియన్ టన్నులు ఉంటుందని అంచనా.

సర్టిఫికేషన్ పొందడంతో, ఎఎం/ఎన్ఎస్ ఇండియా ఫోర్ స్టార్ రేటింగ్ కలిగిన హెచ్ఆర్ ఉత్పత్తులు, త్రీ స్టార్ రేటింగ్ కలిగిన సీఆర్ ఉత్పత్తుల వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించింది, దేశీయ వినియోగదారులకు విశ్వసనీయమైన, ప్రభుత్వం ధృవీకరించిన గ్రీన్ స్టీల్ ప్రత్యామ్నాయాన్ని అందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వం, స్థిరమైన ఉక్కు ఉత్పత్తిదారుగా భారత్ స్థానాన్ని బలోపేతం చేసింది.

FY25లో, ఎఎం/ఎన్ఎస్ ఇండియా జాతీయ సగటుతో పోలిస్తే 14% తక్కువ CO₂ ఉద్గారాల తీవ్రతను సాధించిం ది. 2021 బేస్‌లైన్‌తో పోలిస్తే 2030 నాటికి తన ఉద్గార తీవ్రతను 20% తగ్గించాలన్నది కంపెనీ లక్ష్యం.  

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -