Sunday, June 22, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంమిస్సైల్స్‌తో ఇరాన్ పై విరుచుకుపడిన అమెరికా..

మిస్సైల్స్‌తో ఇరాన్ పై విరుచుకుపడిన అమెరికా..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న ప్రత్యక్ష యుద్ధంలోకి అమెరికా కూడా ఎంటర్ అయింది. ఇప్పటికే పలు మార్లు ఇరాన్ ను హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నట్లుగానే.. ఇరాన్ లోని అణు ఆయుధ కేంద్రాలపై శనివారం అర్ధరాత్రి దాడులకు జరిపారు. ఈ దాడులపై ఇరాన్‌లోని ఇస్ఫహాన్ ప్రావిన్స్ డిప్యూటీ గవర్నర్ అక్బర్ సలేహి స్పందిస్తూ.. నతాంజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలపై దాడి జరిగిందని అన్నారు. ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలు అయిన ఫోర్డో, నతాంజ్, ఇస్ఫాహన్ లపై అమెరికా యుద్ధ విమానాలు బాంబులు వేసాయని అధ్యక్షుడు ట్రంప్ శనివారం రాత్రి ప్రకటించారు. ఈ దాడి అనంతరం అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -