- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : వినాయక నిమజ్జన శోభాయాత్రలో పాల్గొనేందుకు ఈ నెల 6న కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ రానున్నారు. ఉ.11 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని తొలుత పార్టీ ముఖ్యనేతలతో భేటీ అవుతారు. అనంతరం భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు మధ్యాహ్నం ఒంటి గంటకు చార్మినార్ వద్ద నిమజ్జన ఊరేగింపులో పాల్గొంటారు. మ.3.30 గంటలకు ఎంజే మార్కెట్ వద్ద శోభాయాత్రలో ప్రసంగిస్తారు.
- Advertisement -