- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో మండల కేంద్రమైన తాడిచెర్లలోని ఇంటర్ పరీక్ష కేంద్రానికి కస్తూరిబ్బా, మోడల్ స్కూల్, తాడిచెర్ల జూనియర్ కళాశాల విద్యార్థులు హాజరై రావాలి. ఈ నేపథ్యంలో కస్తూరిబ్బా పాఠశాల విద్యార్థులకు తాడిచెర్లలో బొగ్గు తవ్వకాలు చేపట్టిన ఏఎమ్మార్ కంపెనీ బస్సు ద్వారా ఉచితంగా సేవలందిస్తున్నారు. పరీక్షలు ముగిసేవరకు ఈ సేవలు కొనసాగుతాయని ఏఎమ్మార్ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి,సీనియర్ మేనేజర్ కెఎస్ఎన్ మూర్తి తెలిపారు.
- Advertisement -



