– తెలంగాణకు కేటాయిస్తూ ఉత్తర్వులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఐఏఎస్ అధికారిణి కాటా ఆమ్రపాలికి కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్)లో ఊరట లభించింది. తెలంగాణ నుంచి రిలీవై ఏపీ క్యాడర్లో చేరిన ఆమెను తిరిగి రాష్ట్రానికి కేటాయిస్తూ క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది. అమ్రపాలితో పాటు ఏపీ, తెలంగాణ కేడర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై కేంద్రం నాలుగు నెలల క్రితం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ కేడర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఆంధ్రప్రదేశ్లో రిపోర్టు చేయాలని డీవోపీటీ ఆదేశించింది. తమను తెలంగాణకే కేటాయించాలన్న పలువురి అభ్యంతరాలనూ తోసిపుచ్చింది. కేంద్రం ఆదేశాలతో తెలంగాణలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులు ఆమ్రపాలి, రొనాల్డ్ రోస్, వాకాటి కరుణ, వాణీప్రసాద్, ప్రశాంతి ఏపీలో విధులు నిర్వర్తిస్తున్నారు. డీవోపీటీ ఆదేశాలను సవాల్ చేస్తూ తనను తెలంగాణకు కేటాయించాలని ఆమె క్యాట్లో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా అమ్రపాలిని తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది.
ఆమ్రపాలికి క్యాట్లో ఊరట
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES