రామ్ పోతినేని హీరోగా ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ దర్శకుడు మహేష్ బాబు పి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్నారు. కన్నడ సూపర్స్టార్ ఉపేంద్ర ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు.
రామ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, మేకర్స్ ఈ సినిమా టైటిల్ను అద్భుతమైన గ్లింప్స్ ద్వారా రిలీజ్ చేశారు.
2000లో ప్రారంభంలో సెట్ అయిన ఈ క్లిప్ హౌస్ఫుల్ థియేటర్ వెలుపల అభిమానుల సందడితో ప్రారంభమవు తుంది. ఆ సమయంలో థియేటర్ యజమాని, ఆంధ్రా కింగ్ సూర్య కుమార్ లేటెస్ట్ సినిమాకు టికెట్ల కోసం వచ్చే కాల్స్తో బిజీగా ఉంటాడు. మొదటిగా అతను విఐపి రిఫరెన్స్ ఉన్నవారికి టికెట్లు కేటాయిస్తాడు. కానీ తర్వాత విసిగిపోయి ఫోన్ను పక్కన పెడతాడు. అప్పుడే, సూర్యకుమార్గా రామ్ స్పెషల్ స్టయిల్ని అనుసరిస్తూ, సైకిల్పై ఎంట్రీ ఇస్తాడు. ‘ఆంధ్రా కింగ్ ఫ్యాన్స్’ అంటూ ధైర్యంగా 50 టికెట్లు అడుగుతాడు. అతని ఆత్మవిశ్వాసాన్ని చూసి థియేటర్ యజమాని మాట లేకుండా టికెట్లు ఇస్తాడు. రామ్, ఫ్యాన్స్తో కలిసి సంబరంగా వేడుక చేసుకుంటాడు, తన అభిమాన హీరో భారీ కటౌట్ ముందు హీరోయిక్ పోజ్ ఇస్తాడు. పేలుతున్న పటాకులతో ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ అని టైటిల్ రివీల్ అవుతుంది.
స్టార్ హీరో అయినప్పటికీ రామ్ ఈ ప్రత్యేక పాత్రలో ఒక గొప్ప అభిమాని పాత్రను పోషించడం విశేషం. అభిమాని పాత్రలో అతని స్టైల్, ఎమోషన్ కనిపిస్తున్నాయి. ఈ పాత్ర కోసం రామ్ స్పెషల్గా మేకోవర్ కూడా అయ్యారు. కథలో సూపర్స్టార్ కేవలం కటౌట్ రూపంలోనే కనిపించడమే కాక, ఉపేంద్రను స్క్రీన్పై ఐకాన్గా పరిచయం చేశారు. దర్శకుడు మహేష్ బాబు తన స్పెషల్ హ్యుమర్తో పాటు హదయాన్ని హత్తుకునే కథనాన్ని అందించారు. ఫస్ట్ డే ఫస్ట్ షోలో అభిమానులకు ఇచ్చే ప్రాధాన్యతను చూపించడంలో రైటింగ్ అదిరిపోయింది. మొత్తానికి, టైటిల్ గ్లింప్స్తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి అని చిత్ర యూనిట్ తెలిపింది.
‘ఆంధ్ర కింగ్ తాలూకా..’
- Advertisement -
- Advertisement -