– లేబర్ కోడ్లను రద్దు చేయాల్సిందే
– జులై 9న జరిగే సార్వత్రిక సమ్మెలో పాల్గొంటాం : స్త్రీ, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్కు తెలంగాణ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ సమ్మెనోటీసు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లను రెగ్యులరైజ్ చేయాలనీ, టీచర్లకు రూ.32 వేలు, హెల్పర్లకు రూ.26 వేల వేతనమివ్వాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.సునీత, పి.జయలక్ష్మి, కోశాధికారి పి.మంగ డిమాండ్ చేశారు. జులై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్కు సమ్మె నోటీసు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలను కార్మిక చట్టాల పరిధిలోకి తేవాలన్నారు. పర్మినెంట్పై గుజరాత్ హైకోర్టు, గ్రాట్యూటీపై సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కనీస పెన్షన్ రూ.9 వేలు ఇవ్వాలన్నారు. 45వ, 46వ ఐఎల్సీ సిఫారసుల ప్రకారం పెన్షన్, ఈఎస్ఐ, పీఎఫ్ మొదలైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. నూతన జాతీయ విద్యా విధానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈసీసీఈ చట్టం ప్రకారం ఐసీడీఎస్లను సంస్థాగతం చేయడానికి తగిన ఆర్థిక కేటాయింపులు చేయాలని కోరారు. ఐసీడీఎస్లను ప్రయివేటీకరించొద్దని డిమాండ్ చేశారు. మొబైల్ అంగన్వాడీ సెంటర్ల నిర్ణయాలను తక్షణమే ఉపసం హరించుకోవాలన్నారు. పౌష్టికాహారం పరిమాణాన్ని, నాణ్యతను పెంచి మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లను రెగ్యులరైజ్ చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES