Sunday, June 1, 2025
E-PAPER
Homeఆటలుఅంజ‌న్నా..ఫైన‌ల్‌లో ఆర్సీబీ క‌ప్పు కొట్టాలి..

అంజ‌న్నా..ఫైన‌ల్‌లో ఆర్సీబీ క‌ప్పు కొట్టాలి..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఇటీవ‌ల జ‌రిగిన కీల‌క ప్లే ఆప్‌ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ లెవ‌న్‌పై రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు విక్ట‌రీ కొట్టిన విష‌యం తెలిసిందే. దీంతో ఐపీఎల్ సీజన్ 18లో ఆర్సీబీ ఫైనల్‌కు దూసుకుపోవడంతో..ఆ జ‌ట్టు అభిమానులు సంబ‌రాలు చేసుకుంటున్నారు. మ‌రికొంద‌రు ప‌లు ఆల‌యాల‌కు వెళ్లి ఆర్సీబీ ఫైన‌ల్ లో గెలువాల‌ని దేవుళ్ల‌కు మొర‌పెట్టుకుంటున్నారు. ఈక్ర‌మంలో తాజాగా నాకు భ‌క్తి ఉంది దానికి దేవుని మొక్కు కూడా ఉంద‌ని ఓ ఆర్సీబీ భ‌క్తుడు ఆ జ‌ట్టుపై త‌న అభిమానని చాటుకున్నాడు. ఈసారి ఆర్సీబీ (RCB) కప్పు కొట్టాలని కొండగట్టు అంజన్న హుండీలో చీటీ రాసి వేశాడు. ‘ప్లీజ్ గాడ్.. దిస్ ఇయర్ ఆర్సీబీ వన్ ద ట్రోఫీ.. ఈ సాలా కప్ నమదే’ అంటూ చీటీపై పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అంతేకాకుండా ఇటీవ‌ల ఓ మ‌హిళ కూడా విచిత్ర ప్ర‌క‌ట‌న చేసింది.ఓ మహిళ ఈసారి ఆర్సీబీ జట్టు ఐపీఎల్ టైటిల్ గెలవకపోతే తన భర్తకు విడాకులు ఇస్తా అంటూ ప్లకార్డును స్టేడియంలో ప్రదర్శించింది. దానిపై కింగ్ కోహ్లీ హ్యాష్ ట్యాగ్‌ను సైతం జోడించింది. ఈ ఫొటో తెగ వైరల్ అవుతోంది. అభిమానుల ఆశల నేపథ్యంలో ఆర్సీబీ టీమ్ అదృష్టం ఎలా ఉందో అనేది వచ్చే నెల 3వ తేదీన తేలనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -