Saturday, May 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వార్షిక ఋణ ప్రణాళిక - 2025–26 ఆవిష్కరణ.

వార్షిక ఋణ ప్రణాళిక – 2025–26 ఆవిష్కరణ.

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన 2025–26 ఆర్థిక సంవత్సరపు వార్షిక ఋణ ప్రణాళిక ను జిల్లా కలెక్టర్  హనుమంతరావు  జిల్లా కలెక్టరేట్ లో జరిగిన బ్యాంకర్ల సమావేశంలో అధికారికంగా ఆవిష్కరించారు. ఈ ప్రణాళికకు రూ.6,660.15 కోట్ల అంచనాతో రూపకల్పన చేయబడిందన్నారు. ఈ మొత్తంలో  రూ.5,334.80 కోట్లు (80.10%) ప్రాధాన్యత రంగాలకు కేటాయించగా, రూ.1,325.35 కోట్లు అప్రాధాన్యత రంగాలకు కేటాయించబడింది. 

ప్రాధాన్యత రంగాల వారీగా కేటాయింపులు:
– వ్యవసాయ రంగానికి: ₹4,284.41 కోట్లు (మొత్తం ప్రణాళికలో 64.31%)
– పంట రుణాలు: ₹2,391.28 కోట్లు
– వ్యవసాయ టర్మ్ లోన్లు: ₹1,599.67 కోట్లు
సూక్ష్మ, చిన్న & మధ్య తరహా పరిశ్రమలు ₹902.67 కోట్లు, ఇతర ప్రాధాన్యత రంగాలు: ₹147.72 కోట్లు , ఈ ప్రణాళిక ముఖ్యంగా వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించడం, సూక్ష్మ పరిశ్రమల వృద్ధి,  గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం వంటి లక్ష్యాలతో రూపొందించబడిందనారు. గత ఏడాది ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. 2024–25 సంవత్సరానికి సంబంధించిన వార్షిక క్రెడిట్ ప్రణాళిక అమలు పై సమీక్ష నిర్వహించిన కలెక్టర్ గారు, బ్యాంకుల పనితీరును సమీక్షించారు. డిఆర్డిఏ సేర్ప్  ద్వారా స్వయం సహాయ సంఘాల కు రూ.651.36 కోట్ల రుణాలు మంజూరవగా, లక్ష్యం రూ.614.31 కోట్లు ఉండడంతో 106.03% సాధన నమోదైందనారు. 

రాజీవ్ యువ వికాసం పథకం అమలులో బ్యాంకుల సహకారం అత్యంత అవసరమని పేర్కొన్నారు.రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి బ్యాంకర్ల ద్వారా దరఖాస్తుల వరిఫికేషన్ పూర్తయిన అనంతరం, ఎంపికైన లబ్ధిదారుల జాబితా బ్యాంకులకు వచ్చిన వెంటనే ఏలాంటి ఆలస్యం లేకుండా యూనిట్లు గ్రౌండింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

జిల్లాలో ఖరీఫ్ పంటల సాగు ప్రారంభంకానున్న నేపథ్యంలో, రైతులకు పంట రుణాలు సమయానికి అందించాలని జిల్లా కలెక్టర్ అన్ని బ్యాంకులను ఆదేశించారు.జిల్లాలోని రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థుల కోసం కాస్మెటిక్ చార్జీలు  నేరుగా విద్యార్థుల  ఖాతాల్లో జమ చేయడానికి  బ్యాంక్ శాఖలు విద్యార్థులకు బ్యాంక్ ఖాతాలు తెరవాలని, డెబిట్ కార్డులు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ నాగిరెడ్డి, ఎస్‌సి కార్పొరేషన్  ఈడీ  శ్యామ్ సుందర్, బీసీ వెల్ఫేర్ అధికారి  యాదయ్య,జిల్లా పరిశ్రమల శాఖ జీఎం రవీందర్,  లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ శివరామకృష్ణ ,ఆర్బీఐ  ఏజీఎం లక్ష్మీ  శ్రావ్య,నాబార్డ్ ఏజీఎం వినయ్ కుమార్ , ప్రభుత్వ అధికారులు, బ్యాంకు అధికారులు , మరియు సంబంధిత శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -