Saturday, June 21, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంమ‌రో 517మంది భారత్‌కు రాక‌

మ‌రో 517మంది భారత్‌కు రాక‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఇజ్రాయిల్‌ – ఇరాన్‌ ఘర్షణల నేపథ్యంలో 517 మంది భారతీయులు స్వదేశానికి తిరిగి వచ్చారు. ఆపరేషన్‌ సిందులో భాగంగా భారతీయుల్ని తరలించినట్లు భారత విదేశాంగ మంత్రిత్వశాఖ శనివారం తెలిపింది. తుర్క్మెనిస్తాన్‌లోని అష్గాబాత్‌ నుండి ప్రత్యేక విమానంలో భారతీయుల్ని తరలించాం. శనివారం ఉదయం 3 మూడు గంటలకు ఢిల్లీ విమానాశ్రయంలో ఆ విమానం ల్యాండ్‌ అయింది. వారంతా భారత్‌లోని స్వస్థలాలకు సురక్షితంగా చేరుకోనున్నారు’ అని విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జైశ్వాల్‌ ఎక్స్‌ పోస్టులో పేర్కొన్నారు.

ప‌శ్చిమాసియాలో యుద్ధ‌మేఘాలు క‌మ్ముకోవ‌డంతో ఇజ్రాయిల్-ఇరాన్ గ‌గ‌న‌త‌లాన్ని మూసివేశాయి. దీంతో ఆయా దేశాల గుండా విమాన రాక‌పోక‌లు నిలిచిపోయాయి. ఇరాన్ లో ఉన్న భారతీయుల‌ను క్షేమంగా ఇండియాకు త‌ర‌లించ‌డానికి..ఖ‌మేని ప్ర‌భుత్వంతో భార‌త్ ప్ర‌భుత్వం చర్చ‌లు సాగించింది. ఈక్ర‌మంలో ఇరాన్ త‌న గ‌గ‌న‌త‌లం గుండా భార‌తీయుల‌ను త‌ర‌లించడానికి అంగీక‌రించింది. దీంతో భార‌త్ స‌ర్కార్ ఆప‌రేషన్ సింధు ద్వారా శుక్ర‌వారం 1000మందిని భార‌త్ కు త‌ర‌లించింది. తాజాగా మ‌రో వంద‌ల మందిని ఇండియాకు ర‌ప్పించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -