- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : శనివారం టీ20 ప్రపంచ కప్ మొదలుకానుంది. ఫిబ్రవరి 11న ఐర్లాండ్తో ఆస్ట్రేలియా తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ క్రమంలో ఆ జట్టుకు పెద్ద షాక్ తగిలింది. మరో పేసర్ పొట్టి కప్ టోర్నీకి దూరమయ్యాడు. జోష్ హేజిల్వుడ్ గాయం నుంచి కోలుకోలేకపోవడంతో దూరమైనట్లు ఆసీస్ క్రికెట్ వర్గాలు తెలిపాయి. అతడికి బదులు ఇంకా ఎవరినీ ఎంపిక చేయలేదు. ఇప్పటికే పాట్ కమిన్స్ జట్టులో లేని సంగతి తెలిసిందే.

- Advertisement -



