- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలకు మరో అల్పపీడనం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో ఏపీ, తెలంగాణను వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. రెండు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు అంచనా వేసింది. ఇప్పటికే ఇరు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రాజెక్టులకు వరద నీరు కొనసాగుతోంది.
- Advertisement -