- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : అఫ్గానిస్థాన్ను వరుస భూకంపాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అర్ధరాత్రి సమయంలో కాబూల్ ప్రాంతంలో మరోసారి 6.2 మ్యాగ్నిట్యూడ్తో భారీ భూకంపం సంభవించింది. 133KM లోతులో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ తెలిపింది. కాగా ఇటీవల సంభవించిన భూకంపంతో ఇప్పటివరకు 2,217 మంది మరణించిన విషయం తెలిసిందే. తాజా ప్రకంపనలతో మరింత ప్రాణ నష్టం జరిగే అవకాశముంది. గత 5 రోజుల్లో ఈ ప్రాంతంలో ఇది మూడో భూకంపం.
- Advertisement -