బెంగళూరు: ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లను ఉత్పత్తి చేసే స్టార్టప్ సంస్థ ఒబెన్ ఎలక్ట్రిక్ మరో రూ.50 కోట్ల నిధులను సమీకరించినట్లు ప్రకటించింది. సిరీస్ ఎ రౌండ్లో ఈ పెట్టుబడిని అందుకున్నట్లు పేర్కొంది. ఇంతక్రితం జనవరిలో రూ.50 కోట్ల నిధులకు ఇది అదనమని పేర్కొంది. దీంతో సిరీస్ ఎ ఫండింగ్లో రూ.100 కోట్లు అందుకోగా.. ఇప్పటి వరకు మొత్తంగా రూ.200 నిధులు సమీకరించినట్టు వెల్లడించింది. తాజాగా నిధులు అందించిన వాటిలో హెలియోస్ హోల్డింగ్స్, షర్దా ఫ్యామిలీ ఆఫీసు, కె ఫ్యామిలీ, ఇతర ఇన్వెస్టర్లు ఉన్నారని పేర్కొంది. ప్రస్తుతం ఈ సంస్థకు 27 నగరాల్లో 37 అవుట్లెట్లు ఉన్నాయి. 2026 మార్చి నాటికి దేశంలో 50 నగరాల్లో 150 షోరూంలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.