Saturday, May 31, 2025
E-PAPER
Homeజాతీయంశశిథరూర్ బాట‌లో మ‌రో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత

శశిథరూర్ బాట‌లో మ‌రో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: కాంగ్రెస్ పార్టీలో ఉంటూ బీజేపీకి అనుకూలంగా ఎంపి శశిథరూర్ చేసిన వ్యాఖ్య‌లు విదిత‌మే. తాజాగా ఆయ‌న బాట‌లోనే మ‌రో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సల్మాన్‌ ఖుర్షిద్‌ చేరారు. ఆర్టికల్‌ 370ని సల్మాన్‌ సమర్థించారు. బీజేపీ ప్రభుత్వ చర్యను ఆయన ప్రశంసించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకించి భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌పై ఏర్పాటైన అఖిలపక్ష బృందంలో భాగంగా సల్మాన్‌ ఇండోనేషియా పర్యటించారు. ఇండోనేషియాలో శుక్రవారం విద్యాసంస్థల సభ్యులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ‘అంతకుముందు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 370 కింద జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించడం వల్ల వేర్పాటుభావన పెంపొందింది. దీనివల్ల కాశ్మీర్‌కు చాలాకాలం పెద్ద సమస్యగా ఉంది. ఆర్టికల్‌ 370 వల్ల దేశం నుంచి కాశ్మీర్‌ ప్రజలు వేరుగా ఉన్నామనే భావనతో ఉన్నారు. కానీ ఆర్టికల్‌ 370ని రద్దు చేసి దేశం నుంచి కాశ్మీర్‌ వేరు అనే భావనను బిజెపి ప్రభుత్వం తొలగించింది. దీనివల్లే.. జమ్మూకాశ్మీర్‌లో ఎన్నికలు జరిగాయి. 65 శాతం ఓట్లు పోలయ్యాయి. ప్రభుత్వం ఏర్పడింది. మళ్లీ ఆర్టికల్‌ 370ని పునరుద్ధరించాలని కోరుకోవడం మంచిది కాదు’ అని ఆయన అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -