Saturday, May 31, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్కేటీఆర్‌పై కవిత సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

కేటీఆర్‌పై కవిత సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : రాష్ట్రంలో కొత్త పార్టీ పెడతారనే ఊహాగానాల నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత జోరు పెంచారు. బీఆర్ఎస్‌లోని అగ్రనేతలే టార్గెట్‌గా ఆమె విమర్శనాస్త్రాలు సంధించారు. ఇవాళ కవిత మీడియాతో చిట్‌చాట్‌ చేస్తూ.. దేశం బయట సోషల్ మీడియా, మొబైల్ ఫోన్లు పెట్టుకుని తనపై కొందరు కుట్రలు చేస్తున్నారు ఆరోపించారు. ఆ తెలివితేటలు ప్రతిపక్షాలపై చూపించండి తనపై కాదని హితవు పలికారు. నాకు నీతులు చెబుతున్న వాళ్లంతా నీళ్ల వివాదం‌పై మాట్లాడితే బాగుంటుందని ధ్వజమెత్తారు. ట్విట్టర్‌లో ట్వీట్లు చేస్తే సరిపోదని.. క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందని కేటీఆర్‌ను ఉద్దేశించి కామెంట్ చేశారు. ఆడబిడ్డ మీద పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడిస్తే ఏం రాదని.. తాను అసలే మంచిదాన్ని కాదని.. నోరు విప్పితే తట్టుకోలేరని అన్నారు. కేసీఆర్‌ను నడిపించేంత పెద్దోళ్లా మీరు అంటూ కవిత ఫైర్ అయ్యారు.

ఇక పార్టీ సోషల్ మీడియా తనను టార్గెట్ చేసిందని.. తప్పుడు వార్తలు రాస్తే పార్టీ ఎందుకు ఖండిచడం లేదని ప్రశ్నించారు. తన డిమాండ్ ఒక్కటేనని.. లేఖను ఎవరు లీక్ చేశారో చెప్పి తీరాలన్నారు. కేసీఆర్‌కు నోటీసులిస్తే ఎందుకు నిరసనలు చేయడం లేదని అన్నారు. అదే మరో నేతకు నోటీసు ఇస్తే ఎందుకు హంగామా చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను వాళ్లలాగా చిచోరా రాజకీయాలు చేయనని హుందాగా ఉండే వ్యక్తినని అన్నారు.

బీఆర్ఎస్ ను గంపగుత్తగా బీజేపీకి అప్పగించాలన్న ప్రయత్నం పార్టీలో జరుగుతోంది. జైలులో ఉన్నప్పుడే ఆ ప్రతిపాదన వస్తే నేను గట్టిగా వ్యతిరేకించాను. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాకుండా స్వతంత్రంగా ఉండాలన్నదే నా అభిమతం. నాపై దుష్ప్రచారం చేస్తున్నా పార్టీ స్పందించలేదు. నన్ను పార్టీ నుంచి ఎవరు బయటకు పంపుతారు?.. అంత సీన్‌ ఎవరికీ లేదు. కాంగ్రెస్‌తో సంప్రదింపులు జరిపినట్టు జరుగుతున్న ప్రచారం పచ్చి అబద్ధం. బీఆర్ఎస్ లో కేసీఆర్‌ మాత్రమే నాకు నాయకుడు.. ఆయన నాయకత్వంలోనే పనిచేస్తాను. వెన్నుపోటు పొడవడం నా లక్షణం కాదు… నేరుగానే పోరాడతాను.

కేసీఆర్‌కు నోటీసులు ఇస్తే నేతలెవరూ స్పందించకపోతే ఎలా? నాకు నీతులు చెబుతూ కోవర్టులు ఉన్నారంటున్నారు. నా మీద పడి ఏడిస్తే ఏంటి ఉపయోగం? ఇంటి ఆడబిడ్డ గురించి ఎలా పడితే అలా మాట్లాడిస్తే అది మర్యాదేనా? లిక్కర్‌ కేసు సమయంలో రాజీనామా చేస్తానంటే వద్దని వారించింది కేసీఆర్ కాదా? సొంత పార్టీ వాళ్లే కుట్రపూరితంగా నన్ను ఎంపీగా ఓడించారు. అదే జిల్లాలో ప్రొటోకాల్‌ ఉండాలని కేసీఆర్‌ నాకు ఎమ్మెల్సీ ఇచ్చారు. లీకు వీరులను ఎండగట్టమంటే నాపై ప్రతాపం చూపుతున్నారు. కాంగ్రెస్‌, బీజేపీపై మాట్లాడాలి కానీ.. నాపై దాడి చేస్తే ఎలా? నాపై దాడి చేయమని ఎవరు చెప్పారు?

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -