- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: అనుష్క, జయసూర్య జంటగా నటిస్తున్న మలయాళ చిత్రం ‘కథనార్’ నుండి తాజాగా ట్రైలర్ విడుదలైంది. ఫాంటసీ థ్రిల్లర్ స్టోరీతో తీసిన ఈ సినిమాని తెలుగు, తమిళంలోనూ రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రంలో ప్రభుదేవా, శాండీ మాస్టర్, వినీత్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ ఏడాది జూలై లేక ఆగస్టులో ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుందని తెలుస్తోంది. రోజిన్ థామస్ ఈ సినిమాను తెరకెక్కించారు. అనుష్క కెరియర్లో ఇది 50వ చిత్రంగా రానుంది.
- Advertisement -



