- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఏపీలోని బాపట్ల జిల్లా కారంచేడుకు చెందిన రాజ్యలక్ష్మి (23) అనే విద్యార్థిని అనారోగ్యంతో అమెరికాలో మృతిచెందింది. ఆమె కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతో, మృతదేహాన్ని భారత్కు తరలించడానికి యూఎస్లోని భారత కమ్యూనిటీ గోఫండ్మీ ద్వారా నిధులు సేకరిస్తోంది. అంత్యక్రియలు, విద్యా రుణాల చెల్లింపు, తల్లిదండ్రులకు సహాయం అందించేందుకు ఈ నిధులు వినియోగించబడతాయి. రాజ్యలక్ష్మి ఉన్నత చదువుల కోసం 2023లో అమెరికాలోని టెక్సాస్కు వెళ్ళింది. ఇటీవల అనారోగ్యంతో మృతిచెందింది.
- Advertisement -



