-కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
– 206 దరఖాస్తుల రాక
నవతెలంగాణ-రాజన్న సిరిసిల్ల : ప్రజావాణి అర్జీలు సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. జిల్లా సిరిసిల్ల సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి, త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. మొత్తం దరఖాస్తులు 206 వచ్చాయి.
రెవెన్యూ శాఖకు సంబంధించి 77, గృహ నిర్మాణ శాఖకు 30, డీఆర్డీఓకు 26, జిల్లా విద్యాధికారి కార్యాలయం 12, శ్రీ రాజరాజేశ్వర ఆలయ ఈవో కు 9, ఉపాధి కల్పన శాఖకు 8, జిల్లా సంక్షేమ అధికారి, ఎస్డీసీకి 6 చొప్పున, మైనార్టీ సంక్షేమ శాఖ, సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయానికి ఐదు చొప్పున, జిల్లా పంచాయతీ కార్యాలయానికి 4, ఎస్పీ ఆఫీస్ కు 3, జిల్లా వ్యవసాయ అధికారి, డీసీఎస్ఓ, ఎల్డీఎం, జిల్లా నీటి పారుదల శాఖ, జిల్లా రవాణా శాఖకు రెండు చొప్పున, జిల్లా వైద్యాధికారి, ఎస్సీ కార్పొరేషన్, డీవైఎస్ఓ, డిస్ట్రిక్ట్ వెటర్నరీ కార్యాలయం, ఈ డీ ఎంకు ఒకటి చొప్పున వచ్చాయి. కార్యక్రమంలో గడ్డం నగేష్, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్, జెడ్పీ సీఈవో వినోద్ కుమార్, డీఆర్డీఓ శేషాద్రి, జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అర్జీలు సకాలంలో పరిష్కరించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES