- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఈరోజు దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యతలు ప్రమాదకర స్థాయిలోనే నమోదయ్యాయి. దీంతో ఢిల్లీవాసులకి శ్వాసకోశ సమస్యలతో బాధపగుతున్నారు. మంగళవారం ఉదయం 9 గంటల సమయానికి 415 వద్ద ఎక్యూఐ స్థాయిలు నమోదయ్యాయి. దీంతో వీటి స్థాయిల్ని తీవ్ర ప్రమాదకర స్థాయిలో వర్గీకరించినట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి పేర్కొంది. ఢిల్లీలోని 27 పర్యవేక్షణ కేంద్రాల్లో 400పైనే ఎక్యూఐ స్థాయిలు నమోదయ్యాయి. తీవ్ర ప్రమాదకర స్థాయిల్లో ఆనంద్ విహార్ 470, నెహ్రూ నగర్ 463, ఓక్లా 459, ముండ్కా 459, సిరిఫోర్ట్ 450 వద్ద ఎక్యూఐ నమోదైందని సిపిసిబి సమీర్ యాప్ పేర్కొంది.
- Advertisement -



