Saturday, June 14, 2025
E-PAPER
Homeరాష్ట్రీయం19న అరిబండి మెమోరియల్‌ లెక్చర్‌

19న అరిబండి మెమోరియల్‌ లెక్చర్‌

- Advertisement -

– పోస్టరావిష్కరణలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

ఈ నెల 19న అరిబండి లక్ష్మీనారాయణ మెమోరియల్‌ లెక్చర్‌, వానాకాలం సాగు సెమినార్‌ను హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్నట్టు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్‌, అరిబండి లక్ష్మినారాయణ మెమోరియల్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ ప్రొఫెసర్‌ అరిబండి ప్రసాదరావు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌ లోని రైతు సంఘం కార్యాలయంలో పోస్టర్‌ను విడుదల చేశారు. అరిబండి లక్ష్మీనారాయణ ఏడో స్మారకోపాన్యాసాన్ని వ్యవసాయ రంగం – ఎదుర్కొంటున్న సవాళ్లు అనే అంశం పై అఖిల భారత కిసాన్‌ సభ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ విజూ కృష్ణన్‌ ప్రధాన ఉపన్యాసం చేస్తారని తెలిపారు. అనంతరం అరిబండి ప్రసాద్‌ రావు రచించిన నేను మన భూమి ఒక జీవన స్మృతి పుస్తకావిష్కరణ ఉంటుందని పేర్కొన్నారు. వానాకాలం సాగు -తీసుకోవాల్సిన చర్యలు అనే అంశంపై సెమినార్‌ జరుగుతుందనీ, సెమినార్‌కు ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వ విద్యాలయం వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ అల్దాస్‌ జానయ్య, కొండా లక్ష్మణ్‌ బాపూజీ హార్టికల్చర్‌ యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ డి రాజి రెడ్డి, వ్యవసాయ శాఖ అదనపు సంచాలకులు డాక్టర్‌ కే విజయకుమార్‌, రైతు సంఘం సీనియర్‌ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌ రావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి తదితరులు ప్రసంగిస్తారని పేర్కొన్నారు. పోస్టర్‌ అవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్‌ శోభన్‌, రాష్ట్ర నాయకులు శివకుమార్‌పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -