నవతెలంగాణ-హైదరాబాద్: పంజాబ్లో ఆయుధాల స్మగ్లింగ్ కు పాల్పడుతున్న ముఠాను శుక్రవారం నిఘా అధికారులు అరెస్ట్ చేశారు. సుఖ్చెయిన్ సింగ్, జుగ్రాజ్ సింగ్లను అదుపులోకి తీసుకున్నట్లు ఆ రాష్ట్ర డీజీపీ గౌరవ్ యాదవ్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తెలిపారు. పాకిస్తాన్కు చెందిన నూర్ అనే స్మగ్లర్తో పలు రోజులుగా ఆయుధాలను ఆక్రమంగా సరఫరా చేస్తున్నారని అధికారులు చెప్పారు. ఉగ్రవాదులకు దేశ సమాచారంతో పాటు తీవ్రవాద కార్యాకలాపాలకు తోడ్పాటు అందిస్తున్నారని డీజీపీ చెప్పారు. పక్కా సమాచారంతో ముఠాపై నిఘా ఉంచి..ఇద్దరిని పట్టుకున్నామన్నారు. వారి నుంచి తొమ్మిది రకాల పిస్తోల్స్, పలు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తన్నామని పోలీసులు తెలిపారు.
పంజాబ్లో ఆయుధాల స్మగ్లర్లు అరెస్ట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES