Sunday, June 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేయాలి : కలెక్టర్

వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేయాలి : కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ-భూపాలపల్లి 
రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించుటకు  ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు.  శుక్రవారం ఐడిఓసి కార్యాలయ సమావేశపు హాలులో అన్ని శాఖల అధికారులతో  సమావేశం   నిర్వహించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ  మాట్లాడుతూ… సమాచార,  డిఆర్డీఏ, సంక్షేమ, అటవీ, ఉద్యాన, వ్యవసాయ తదితర   శాఖలు స్టాల్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అమరవీరుల స్తూపం, డా బిఆర్ అంబేద్కర్, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలను పూలతో అందంగా ముస్తాబు చేయాలని సూచించారు.  వేడుకలకు సంబంధించి ప్రోటోకాల్ పాటిస్తూ అతిధులు కూర్చోడానికి  షామియానాలు, కుర్చీలు, సురక్షిత మంచినీరు ఏర్పాటు చేయాలని సూచించారు. ఉద్యాన, ఆర్ అండ్ బి శాఖల అధికారులు స్టేజ్ ఏర్పాట్లు చేయాలన్నారు,   జిల్లా ప్రగతి సందేశాన్ని తయారు చేయాలని డిపిఆర్వోను  ఆదేశించారు. అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా  విద్యార్థినీ, విద్యార్థులతో పాటు  తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల చే సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని డిపిఆర్వో ను, డీఈఓను  కలెక్టర్ ఆదేశించారు. అంతరాయం లేకుండా విద్యుత్తు సరఫరా చేయాలని, అత్యవసర వినియోగానికి జనరేటర్ సిద్ధంగా ఉంచాలని విద్యుత్ అధికారు లకు సూచించారు. వేడుకల సందర్భంగా అంబులెన్సులు, అత్యవసర వైద్య కేంద్రం, అగ్నిమాపక వాహనం అందుబాటులో ఉంచాలని అన్నారు. మైదానంలో పారిశుద్ధ్య.కార్యక్రమాలు నిర్వహించి పరిశుభ్రం చేయాలని మున్సిపల్ కమీషనర్ ను ఆదేశించారు. వేడుకలకు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు.  ఆర్డిఓ కార్యక్రమాలు ఆసాంతం పర్యవేక్షణ చేయాలని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో  అటవీశాఖ అధికారి నవీన్ రెడ్డి, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, భూపాలపల్లి ఆర్డిఓ రవి, అన్ని శాఖల అధికారులు  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -