నవతెలంగాణ-సారంగాపూర్: మండలంలోని ప్రసిద్ధిగాంచిన అడెల్లి శ్రీ మహా పోచమ్మ అమ్మవారి పునః ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం ఏర్పాట్లను పారిశ్రామిక వేత్త అల్లోల మురళీధర్ రెడ్డి ఆలయ ధర్మ కర్తల తో కలసి పరిశీలించారు.రేపు సోమవారం నుండి ఈ నెల 7 శుక్రవారం వరకు వేద పండితుల ఆధ్వర్యంలో అడెల్లి శ్రీ మహా పోచమ్మ పునఃప్రతిష్ఠ,రూ.6 కోట్ల 50 లక్షలతో కృష్ణ శిలతో నూతనంగా నిర్మించిన ఆలయం ప్రారంభ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా లోని భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని కోరారు.ఈ కార్యక్రంలో వేద పండితులు చంద్ర శేఖర్ శర్మ, ఆలయ చైర్మన్ సింగం బోజా గౌడ్,మాజీ జడ్పీటీసీ రాజేశ్వర్ రెడ్డి ,మాజీ చైర్మన్ లు మాధవ్ రావు,ఉట్ల రాజేశ్వర్,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ దశరథ రాజేశ్వర్,మాజీ స్వర్ణ ప్రాజెక్ట్ ఛైర్మెన్ ఓ.నారాయణ రెడ్డి, ధర్మ కర్తలు మాత మాల దారులు పాల్గొన్నారు.
ఘనంగా ఆడెల్లి పోచమ్మ పున ప్రతిష్టాపన ఏర్పాట్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



