ప్రదీప్ రంగనాథన్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘డ్యూడ్’. కీర్తిశ్వరన్ దర్శకుడు. ఇందులో ప్రదీప్కు జోడీగా ‘ప్రేమలు’ ఫేమ్ మమిత బైజూ హీరోయిన్గా నటిస్తుండగా, సీనియర్ నటుడు శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజైన ప్రదీప్ రంగనాథన్, మమిత బైజూ ఫస్ట్లుక్ పోస్టర్స్కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆదివారం మేకర్స్ మమిత బైజూకి బర్త్డే విషెస్ని అందిస్తూ, ఆమె పాత్రని ‘కురళ్’గా పరిచయం చేస్తూ స్పెషల్ పోస్టర్ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో మమిత బైజూ తన బ్యూటీ అండ్ చార్మ్తో కట్టిపడేశారు. దీంతో ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ప్రేమలు’లో తన ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్తో క్రేజ్ తెచ్చుకున్న మమిత ‘డ్యూడ్’తో అద్భుతంగా అలరించడానికి రెడీ అవుతున్నారు. దీపావళి కానుకగా ఈ ఎంటర్టైనర్ను అందించడానికి టీం జెట్ స్పీడ్లో వర్క్ చేస్తోంది. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో విడుదల కానుంది అని మేకర్స్ తెలిపారు.
ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: కీర్తిశ్వరన్, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్, సిఇఓ :చెర్రీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అనిల్ యెర్నేని, సంగీతం: సాయి అభ్యంకర్, సినిమాటోగ్రాఫర్: నికేత్ బొమ్మి, ప్రొడక్షన్ డిజైనర్: లతా నాయుడు, కాస్ట్యూమ్ డిజైనర్: పూర్ణిమా రామస్వామి, ఎడిటర్: బరత్ విక్రమన్.
‘డ్యూడ్’లో కురళ్గా..
- Advertisement -
- Advertisement -