– అడుగడుగునా ఉల్లంఘించిన సిమెన్స్
– కంపెనీకి అనుకూలంగా తుది ఒప్పందం
2022లో కేంద్ర ప్రభుత్వం జర్మనీకి చెందిన ప్రముఖ కంపెనీ సిమెన్స్కు లోకోమోటివ్ రైల్వే ఇంజిన్ల తయారీ కాంట్రాక్టును కట్టబెట్టింది. అయితే ఆ కంపెనీ ఒప్పందంలోని పలు నిబంధనలను బేఖాతరు చేసినా ప్రభుత్వం కిమ్మనడం లేదు. తుది ఒప్పందం కంపెనీకి అనుకూలంగా ఉన్నదన్న విమర్శలు వస్తున్నాయి. లోకోమోటివ్ ఇంజిన్లను ప్రధాని స్వరాష్ట్రమైన గుజరాత్లోని దాహోద్ లో తయారు చేయాల్సి ఉండగా సిమెన్స్ మాత్రం వాటిని పొరుగున ఉన్న మహారాష్ట్రలో ఉత్పత్తి చేసింది. దాహోద్ కేంద్రాన్ని కేవలం అసెం బ్లింగ్, టెస్టింగ్ పనులకే పరిమితం చేసింది. అసలు ఈ ప్రాజెక్ట్ నిర్వహణకు బిడ్లు దాఖలు చేసిన వారెవరో కూడా తెలియడం లేదు.
న్యూఢిల్లీ: లోకోమోటివ్ రైలు ఇంజిన్ ప్రారంభం సందర్భంగా గత నెల 26న దాహోద్లో ఓ కార్యక్రమం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ దీనికి హాజరయ్యారు. తొమ్మిది వేల హార్స్పవర్ కలిగిన ఈ లోకోమోటివ్ ఇంజిన్ దేశంలోనే మొట్టమొదటిదని వైష్ణవ్ గొప్పగా చెప్పారు. ఈ ఎలక్ట్రిక్ ఇంజిన్లో రీజనరేటివ్ బ్రేకులు ఎలా పనిచేస్తాయో కూడా ఆయన వివరించారు. ఇలాంటి బ్రేకులను మన దేశంలో ఉప యోగించడం ఇదే మొదటిసారి అని అన్నారు. దాహోద్ ప్రజలు ఈ ఘనతను సాధ్యం చేశా రంటూ కొనియాడారు. కానీ వాస్తవానికి భారతీయ రైల్వేలు 1990వ దశకం నుండే రీజనరేటివ్ బ్రేకులతో కూడిన లోకోమోటివ్ ఇంజిన్లను ఉపయోగిస్తున్నాయి. 2000వ సంవత్సరం ప్రారంభం నుండి పశ్చిమ బెంగాల్లోని చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్లో ఇలాంటి ‘మేడ్ ఇన్ ఇండి యా’ ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ఇంజిన్ల తయారీ ప్రారంభమైంది.
శిక్షణపై మౌనం
ఇంజిన్ల తయారీలో రైల్వే సిబ్బందికి శిక్షణ అందించే విషయంలో ఒప్పందంలో చోటుచేసుకున్న మార్పులపై సిమెన్స్ మౌనం వహించింది. లోకోమోటివ్ ఇంజిన్లలోని కీలక భాగాలు గుజరాత్లో తయారు కావాల్సి ఉండగా పొరుగున ఉన్న మహారాష్ట్రలో తయారయ్యాయి. గుజరాత్లోని దోహాద్ లో అన్ని హంగులతో కేంద్రాన్ని ఏర్పాటు చేసినప్పటికీ అది కేవలం అసెంబ్లింగ్, టెస్టింగ్, ప్రారంభ పనులకే పరిమిత మైంది. అసలు ఈ ప్రాజెక్టు కోసం బిడ్లు ఎవరు దాఖలు చేశారో కూడా ప్రభుత్వం చెప్పలేదు. అయితే న్యాయంగా, పారదర్శకంగా, పోటీతత్వంతో ప్రక్రియను పూర్తి చేశామని మాత్రం చెప్పుకొచ్చింది. సిమెన్స్ కంపెనీ గతంలో కూడా భారతీయ రైల్వేలతో కలిసి పనిచేసింది. అయితే ఇప్పటి వరకూ రైల్వే మంత్రిత్వ శాఖతో ఆ కంపెనీ కుదుర్చుకున్న ఒప్పందాలలో దాహోద్ కాంట్రాక్టే పెద్దది.సిమెన్స్ తయారు చేసే లోకోమోటివ్ ఇంజిన్ గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని, 4,600 టన్నుల బరువును లాగుతుందని గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే తన ఇంజిన్ గంటకు 120 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణిస్తుందని, 5,800 టన్నుల బరువును లాగుతుందని సిమెన్స్ చెబుతోంది. ఇక్కడ ఓ విషయాన్ని గమనించాల్సి ఉంది. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ గతంలో సిమెన్స్ లోకోమోటివ్ కంపెనీకి మన దేశంలో వైస్ ప్రెసిడెంటుగా పనిచేశారు. అయితే టెండర్ ప్రక్రియలో మంత్రి ప్రమేయం ఏమీ ఉండదని రైల్వే మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
నిబంధనలు ఏం చెబుతున్నాయి?
దాహోద్ ప్రాజెక్ట్ కాంట్రాక్టును జర్మనీ దిగ్గజ కంపెనీ సిమెన్స్కు అప్పగించినట్లు 2022 డిసెంబరులో రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ కంపెనీ 11 సంవత్సరాల పాటు 9000 హార్స్పవర్ కలిగిన 1,200 ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ఇంజిన్ల తయారీలో సాంకేతిక భాగస్వామిగా వ్యవహరించాల్సి ఉంది. ఇంజిన్లను వాటి జీవితకాలం (35 సంవత్సరాలు) పాటు నిర్వహించే బాధ్యత కూడా సిమెన్స్దే. కాంట్రాక్ట్ అంచనా విలువ రూ.26,000 కోట్లు. ఒప్పందం ప్రకారం రెండు సంవత్సరాలలో సిమెన్స్ కంపెనీ ప్రోటో-టైప్ లోకోమోటివ్లను సరఫరా చేయాల్సి ఉంటుంది. లోకోమోటివ్స్ను సిమెన్స్ కంపెనీ దాహోద్లోనే తయారు చేయాల్సి ఉంటుంది. వీటి నిర్వహణ పనులు మాత్రం విశాఖపట్నం, రాయపూర్, ఖరగ్పూర్, పూనేలో చేపడతారు. తయారీ, నిర్వహణ ప్రక్రియలలో రైల్వే సిబ్బందికి సిమెన్స్ శిక్షణ అందిస్తుంది.
ఈ ప్రశ్నలకు బదులేది?
గుజరాత్లో జరిగిన కార్యక్రమం సందర్భంగా సిమెన్స్ సంస్థ మే 26న ఓ ప్రకటన విడుదల చేసింది. లోకోమోటివ్ ఇంజిన్లలో కీలక భాగాల తయారీ నాసిక్, ఔరంగాబాద్, ముంబయిలోని సిమెన్స్ కర్మాగారాల్లోనే జరుగుతుందని, చిట్టచివరి పనులు మాత్రం దాహోద్లో జరుగుతాయని స్పష్టం చేసింది. అంటే దాహోడ్లోనే లోకోమోటివ్ ఇంజిన్లను తయారు చేయాలన్న నిబంధనను సిమెన్స్ ఉల్లంఘించిం దన్న మాట. సిమెన్స్ ప్రకటన నేపథ్యంలో కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దాహోద్లో అసెంబ్లింగ్, టెస్టింగ్ పనులు మాత్రమే జరగాలన్న నిబంధనను రైల్వేశాఖ ఒప్పందంలో చేర్చిందా? షరతుల్లో ఏవైనా మార్పులు చేశారా? ఇంజిన్ల తయారీలో సిబ్బందికి సిమెన్స్ శిక్షణ ఇస్తుందా? దాహోద్లో ఇంజి న్ల అసెంబ్లింగ్, నిర్వహణ మాత్రమే జరుగుతుందా? ఏదేమైనా తుది ఒప్పందం సిమెన్స్ కంపెనీకే ప్రయో జనం చేకూర్చేలా ఉంది. ఇంజిన్ల తయారీకి సంబంధించిన పరి జ్ఞానాన్ని రైల్వేలకు బదిలీ చేయాల్సిన అవసరమే ఆ కంపె నీకి ఉండదు. నిర్వహణ కోసం తన సిబ్బందిని పూర్తి స్థాయిలో వినియోగించాల్సిన అవసరం కూడా ఉండదు.