- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: కర్ణాటకలోని బళ్లారిలో అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. మహర్షి వాల్మీకి విగ్రహ ఏర్పాటులో వివాదం చెలరేగింది. గాలి జనార్దన్ రెడ్డి ఇంటికి ఫ్లెక్సీలు కట్టాలని ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరులు ప్రయత్నించారు. ఫ్లెక్సీ కడుతుండగా వద్దని గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు వారించారు. దాంతో ఎమ్మెల్యే భరత్ రెడ్డి గన్మెన్ తుపాకీతో ఆయన అనుచరుడు సతీష్ రెడ్డి కాల్పులు జరిపాడు. కాల్పుల్లో ఒకరు మృతి చెందగా.. సతీష్కు గాయాలయ్యాయి. జనార్ధన్ రెడ్డి తృటిలో తప్పించుకున్నారు.
- Advertisement -



