నవతెలంగాణ-మంచిర్యాల: జిల్లా కేంద్రలో గురువారం రాత్రి బీఆర్ఎస్ విద్యార్థి నాయకుడు దగ్గుల మధుపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. తన చిన్ననాటి మిత్రులతో కలిసి పార్టీ చేసుకునే సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి తనపై దాడికి పాల్పడ్డారని, బీఆర్ఎస్ లో కొనసాగడంతోనే తనపై వరుసగా దాడులు జరుగుతున్నాయని, గతంలోను తనపై దాడికి పాల్పడ్డరని, ఎప్పటికైనా తనకు ప్రాణహాని ఉందని మధు వీడియో రిలీజ్ చేశాడు. ప్రస్తుతం మంచిర్యాల జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ లో మధుకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. కక్ష్య పూరితంగానే నస్పూర్ మాజీ మున్సిపల్ చేర్మెన్ సూరమళ్ళ వేణు మధుపై దాడి చేయించినట్లుగా కుటంబ సభ్యులు పేర్కొంటున్నారు. దాడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బీఆర్ఎస్ నాయకుడిపై దాడి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES