- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : మణిపూర్లో మళ్లీ హింస చెలరేగింది. విష్ణుపూర్లో అసోం రైఫిల్స్ కాన్వాయ్పై దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు అక్కడిక్కడే మృతిచెందగా, మరో నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. కాగా, మైతేయి-కుకీ తెగల మధ్య ఘర్షణలతో ఏడాదిన్నరగా అల్లకల్లోలంగా ఉన్న మణిపుర్లో హింస మరోసారి పెచ్చుమీరింది. మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లే లక్ష్యంగా అల్లరి మూకలు రెచ్చిపోతున్నాయి.
- Advertisement -