- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : పాక్ అధీనంలోని బలూచిస్థాన్ ప్రావిన్స్లో BLA రెబల్స్, ఆర్మీ మధ్య జరిగిన దాడుల్లో 125 మంది చనిపోయారు. 12 ప్రాంతాల్లో BLA దాడులు చేసిందని, అందులో 18 మంది సెక్యూరిటీ సిబ్బంది, 15 మంది పౌరులు చనిపోగా పలువురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. మరోవైపు 92 మంది మిలిటెంట్లు చనిపోయినట్లు వెల్లడించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భద్రతా వర్గాలు చెప్పాయి. అక్కడ పరిస్థితి పూర్తిగా అదుపులోకి రాలేదని సమాచారం.
- Advertisement -



