- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వింగ్ విదేశాంగ పర్యటనలో భాగంగా బుధవారం భారత్కు చేరుకున్నారు. ఈ పర్యటన సందర్భంగా ఆమె భారత విదేశాంగ శాఖా మంత్రి ఎస్. జైశంకర్తో ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. సైబర్, సాంకేతికత, వాణిజ్యం, సముద్ర భద్రత, రక్షణ, క్రీడలు, ప్రజా సంబంధాలలో సహకారంపై ఇరువురు విదేశాంగ మంత్రులు చర్చించుకోనున్నారు. ఈ మేరకు ఆమె అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఆస్ట్రేలియా, భారత్ ఎప్పుడూ సన్నిహితంగా లేవు. ఈ పర్యటన చాలా ముఖ్యమైనది. పోటీ ప్రపంచంలో నిలదొక్కుకునేందుకు ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు కీలకం అని ఆమె తన ప్రకటనలో తెలిపారు.
- Advertisement -



