Saturday, May 31, 2025
E-PAPER
Homeఆటలుభారత పర్యటనకు ఆస్ట్రేలియా మహిళలు

భారత పర్యటనకు ఆస్ట్రేలియా మహిళలు

- Advertisement -

– షెడ్యూల్‌ను ఖరారు చేసిన బిసిసిఐ
ముంబయి:
ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియా మహిళల క్రికెట్‌ జట్టు భారత పర్యటనకు రానుంది. ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను బిసిసిఐ గురువారం విడుదల చేసింది. సుదీర్ఘ పర్యటనకు వస్తున్న ఆసీస్‌ మహిళలు ఈ పర్యటనలో భాగంగా మూడు వన్డేలు, మరో మూడు టి20లతోపాటు రెండు టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడనుంది. సెప్టెంబర్‌ 14, 17, 20 తేదీల్లో చెన్నై వేదికగా వన్డే సిరీస్‌ జరగనుంది. ఆస్ట్రేలియా మహిళా క్రికెట్‌ జట్టు భారత్‌లో పర్యటిస్తుండగానే ఆ దేశ పురుషుల-ఎ జట్టు కూడా భారత పర్యటనకు రానుంది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా పురుషుల-ఎ జట్టు భారత పర్యటనకు రానుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -