- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: కర్నాటకలో బైక్ ట్యాక్సీలపై విధించిన నిషేధాన్ని రాష్ట్ర హైకోర్టు ఎత్తివేసింది. గత ఏడాది జూన్లో ఇచ్చిన కోర్టు ఆదేశాల నేపథ్యంలో బైక్ ట్యాక్సీ సేవలు రాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోయాయి. తాజా నిర్ణయంతో బైక్ ట్యాక్సీ కార్యకలాపాలకు మళ్లీ అనుమతి లభించింది. ఈ తీర్పుతో బెంగళూరు సహా ప్రధాన నగరాల్లో ప్రయాణికులకు సౌకర్యం పెరగనుందని, బైక్ ట్యాక్సీలపై ఆధారపడిన డ్రైవర్లకు ఉపాధి అవకాశాలు తిరిగి అందుబాటులోకి రానున్నాయని భావిస్తున్నారు.
- Advertisement -



