- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో తొలిసారి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. 18 సంవత్సరాల సుదీర్ఘ లీగ్లో ఆర్సీబీ తొలిసారి టైటిల్ను గెలువడంతో ఆటగాళ్లు సంబురాల్లో మునిగిపోయారు. ఇక ఇవాళ మధ్యాహ్నం భారీ పరేడ్కు ఆర్సీబీ యాజమాన్యం ప్లాన్ చేసింది. అయితే, గెలుపుతో ఫుల్ జోష్ మీదున్న జట్టుకు బెంగళూరు నగర పోలీసులు షాకిచ్చారు. గ్రాండ్ విక్టరీ పరేడ్కు అనుమతిని నిరాకరించారు. దీంతో మధ్యాహ్నం జరగాల్సిన విక్టరీ పరేడ్ రద్దైంది. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకూ చిన్నస్వామి స్టేడియంలో సత్కారకార్యక్రమానికి మాత్రం అనుమతించారు.
- Advertisement -