నవతెలంగాణ-హైదరాబాద్: గడిచిన పదకొండేళ్ల నుంచి బ్యాంకు మోసాలు పెరిగిపోయినట్లు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ఆరోపించారు. ఫ్రాడ్, ఫేక్లు మోడీ ప్రభుత్వం రక్తంలో ఇమిడిపోయినట్లు ఆయన ఆరోపించారు. గడచిన పదకొండేళ్ల మోడీ పాలనలో సుమారు 6 లక్షల 36 వేల 992 కోట్ల మేర బ్యాంకు ఫ్రాడ్ జరిగింది. ఆ మోసాలు 416 శాతం పెరిగాయని ఖర్గే పేర్కొన్నారు. నోట్ల రద్దు అయిన ఆరేళ్ల తర్వాత కూడా నకిలీ 500 నోట్లు మార్కెట్లో చెలామణి అవుతున్నాయి. ఈ ఏడాది నకిలీ నోట్లు మార్కెట్లోకి అత్యధిక స్థాయిలో వచ్చాయని, ఇది 291 శాతం పెరిగినట్లు ఆయన ఆరోపించారు.
కాగా, తాజాగా పెహల్గామ్ దాడిపై మోడీ రక్తనాళాల్లో సింధూరం ప్రవహిస్తున్నట్లు వ్యఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఖర్గే స్పందిస్తూ … మీ రక్తనాళాల్లో ఏం ఉందో మాకు తెలియదని, కానీ మీ ప్రభుత్వ రక్తనాళాల్లో మాత్రం ఫ్రాడ్, ఫేక్ ఉన్నట్లు ఖర్గే ఆరోపించారు.