- Advertisement -
నవతెలంగాణ-కంఠేశ్వర్
బంద్ ఫర్ జస్టిస్ 18 ని జయప్రదం చేయండి అని బీసీ జేఏసీ రాష్ట్ర కమిటీ కో చైర్మన్ రాజారామ్ యాదవ్ తెలిపారు. పార్టీలకు అతీతంగా ఒక్కటి అయితే విజయం మనది.42 శాతం రిజర్వేషన్లను బీసీలకు రాకుండా అడ్డుకట్ట వేస్తున్న కొందరు అగ్రవర్ణాల తీరుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా బీసీ జేఏసీ ఏర్పాటు చేశాం. బీసీ జేఏసీ ఆధ్వర్యంలో 18 అక్టోబర్ 2025 నాడు రాష్ట్ర వ్యాప్త బందుకు పిలుపునిచ్చాం. ఈ బందుకు అందరూ సహకరించాలని మనవి. అదే విధంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల బీసీ జేఏసీ చైర్మన్ లను ఈ బంద్ (18/10/25) తర్వాతనే నియామకం చేస్తామని తెలుపుతున్నాం.
- Advertisement -