Saturday, June 7, 2025
E-PAPER
Homeఆటలుటీడీసీఏకు బీసీసీఐ గుర్తింపు ఇవ్వాలి

టీడీసీఏకు బీసీసీఐ గుర్తింపు ఇవ్వాలి

- Advertisement -

– శాట్జ్‌ మాజీ చైర్మెన్‌ అల్లీపురం వెంకటేశ్వర్‌ రెడ్డి
హైదరాబాద్‌:
వందేండ్లలో తొలిసారి 2028 లాస్‌ ఏంజిల్స్‌ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చేందుకు ఐసీసీ, బీసీసీఐ విశేష కషి చేయగా.. ఇక్కడ 90 ఏండ్లలో తెలంగాణ గ్రామీణ క్రికెట్‌ అభివద్దికి హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) చేసింది శూన్యమని తెలంగాణ జిల్లాల క్రికెట్‌ సంఘం (టీడీసీఏ) అధ్యక్షుడు, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్జ్‌) మాజీ చైర్మెన్‌ అల్లీపురం వెంకటేశ్వర్‌ రెడ్డి విమర్శించారు. ’90 ఏండ్లలో 9 ఉమ్మడి జిల్లాల్లో క్రికెట్‌ను అభివద్దిని చేయలేని హెచ్‌సీఏ ఇప్పుడు 33 జిల్లాల్లో క్రికెట్‌కు ఏం చేయగలుగుతుంది? ఎటువంటి దశ దిశలేని సమ్మర్‌ క్యాంప్‌లు నిర్వహించి ప్రతిభావంతులైన గ్రామీణ క్రికెటర్లను గుర్తించటంలో హెచ్‌సీఏ ఘోరంగా విఫలమైంది. గ్రామీణ క్రికెటర్లు ఇటువంటి కంటితుడుపు శిక్షణ శిబిరాలను కోరుకోవటం లేదు. తెలంగాణ ఏర్పడి పదేండ్లు అయినా కొత్త జిల్లాల్లో క్రికెట్‌ సంఘాల ఏర్పాటు చేయని హెచ్‌సీఏ, ఇక నూతన జిల్లాల్లో క్రికెట్‌ అభివద్దికి ఇంకెన్ని దశాబ్దాలు కాలయాపన చేస్తుందని’ అల్లీపురం వెంకటేశ్వర్‌ రెడ్డి ప్రశ్నించారు. జిల్లా క్రికెటర్ల కోసం ఉచితంగా టోర్నమెంట్లు, అంతర్జాతీయ స్థాయి పోటీతత్వం అలవాటు చేసేందుకు అమెరికా యూత్‌ క్రికెట్‌ జట్టుతోనూ వన్డే టోర్నమెంట్‌ నిర్వహించిన టీడీసీఏకు బీసీసీఐ గుర్తింపు ఇవ్వటంతోనే తెలంగాణ గ్రామీణ క్రికెట్‌ అభివద్ది సాధ్యమని, ఇందుకోసం గ్రామీణ క్రికెట్‌ కోసం కషి చేస్తున్న సంఘాలన్నీ కలిసి రావాలని అల్లీపురం కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -