- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: లఖ్నవూ సూపర్ జెయింట్స్ స్పిన్ బౌలర్ దిగ్వేశ్ రాఠీపై బీసీసీఐ ఒక మ్యాచ్ నిషేధం విధించింది. ఈ సీజన్లో మూడోసారి ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకుగాను దిగ్వేశ్ రాఠీపై బీసీసీఐ చర్యలు తీసుకుంది. మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించడంతో పాటు, లఖ్నవూ సూపర్ కింగ్స్.. గుజరాత్ టైటాన్స్తో మే 22న అహ్మదాబాద్ వేదికగా ఆడనున్న తదుపరి మ్యాచ్ నుంచి సస్పెండ్ చేసింది. సన్రైజర్స్ హైదరాబాద్తో సోమవారం జరిగిన మ్యాచ్లో అభిషేక్ శర్మతో వాగ్వాదానికి దిగడమే దీనికి కారణం. వికెట్లు తీసిన అనంతరం హద్దులు దాటి సంబరాలు చేసుకున్నందుకుగాను ఇప్పటికే దిగ్వేశ్ రెండుసార్లు జరిమానాకు గురయ్యాడు.
- Advertisement -