Saturday, June 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి- కమిషనర్ రమేష్ 

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి- కమిషనర్ రమేష్ 

- Advertisement -

నవతెలంగాణ- దుబ్బాక : వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ కే.రమేష్ కుమార్ కోరారు. చెత్తను మురికి కాల్వలు,బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా.. తడి పొడి, హానికర చెత్తగా వేరుచేసి మున్సిపాలిటీ వాహనాలకే అందించాలన్నారు. “100 రోజుల్లో 50 కార్యక్రమాలు” అన్న ప్రణాళికలో భాగంగా శుక్రవారం దుబ్బాక మున్సిపల్ కేంద్రంలోని 16, 19 వార్డుల్లో చెత్తను వేరు చేయుట గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. దోమల నియంత్రణకు మురికి కాల్వలో వాటర్ బాల్స్ వేశారు. ఆయన వెంట మేనేజర్ శ్రీనివాస్, ఇన్చార్జి శానిటరీ ఇన్ స్పెక్టర్ దిలీప్, వార్డ్ ఆఫీసర్లు, సిబ్బంది పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -