నవతెలంగాణ-హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పహెల్గాం ఉగ్రదాడి జరిగిందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు.మంగళవారం ఆమె రాష్ట్ర అసెంబ్లీలో ప్రసంగించారు. దాడి జరిగిన ప్రదేశంలో భద్రతా సిబ్బంది ఎందుకు లేరని ప్రశ్నించారు. సాయుధ దళాల ధైర్య సాహసాలను సైతం కేంద్రం రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు. దేశ ప్రజలకు భద్రత కల్పించడంలో బీజేపీ తీవ్రంగా విఫలమైందన్నారు. భద్రత కల్పించడంలో విఫలమైందున ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని డిమాండ్ చేశారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదులు ఎక్కడి నుంచి వచ్చారు? వారికి ఆయుధాలు ఎలా వచ్చాయి? ఇంకా ఎవరినీ ఎందుకు పట్టుకోలేదు? అని ప్రశ్నించారు.రెండు దేశాల మధ్య సైనిక ఘర్షణ జరిగిన సమయంలో పాక్ ఆక్రమిత కశ్మీర్ను భారత్ తన ఆధీనంలోకి తీసుకునే అవకాశం కలిగిందన్నారు. ఈ మేరకు రాష్ట్ర అసెంబ్లీలో సాయుధ దళాలను ప్రశంసిస్తూ అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఓ తీర్మానాన్ని ఆమోదించింది.
సాయుధ దళాలను ప్రశంసిస్తూ బెంగాల్ అసెంబ్లీ తీర్మానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES