నవతెలంగాణ-హైదరాబాద్ : బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు సన్మాన కార్యక్రమం సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీపై పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ దుర్ఘటనలో 11 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.
నైజ హోరాటగారర వేదిక తరఫున ఏఎం వెంకటేశ్ అనే వ్యక్తి కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్లో ఈ ఫిర్యాదు చేశారు. ప్రముఖ క్రికెటర్ అయిన కోహ్లీపై చర్యలు తీసుకోవాలని ఆయన తన ఫిర్యాదులో కోరారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు, ఇప్పటికే ఈ ఘటనపై నమోదైన ఎఫ్ఐఆర్తో కలిపి దీనిని కూడా విచారణకు పరిగణనలోకి తీసుకుంటామని వెంకటేశ్ కు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ తొక్కిసలాట ఘటనపై కర్ణాటక పోలీసులు ఇప్పటికే నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో, ఆర్సీబీ ఫ్రాంచైజీ, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ డీఎన్ఏ, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (కేఎస్సీఏ) పాలక కమిటీలు అవసరమైన అనుమతులు లేకుండానే విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించాయని పేర్కొన్నారు. భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇందులో సెక్షన్ 105 (హత్యతో సమానం కాని నేరపూరిత నరహత్య), 115(2) (స్వచ్ఛందంగా గాయపరచడం), 118(1) (ప్రమాదకర ఆయుధాలు లేదా సాధనాలతో స్వచ్ఛందంగా గాయపరచడం లేదా తీవ్రంగా గాయపరచడం), 118(2) రెడ్విత్ సెక్షన్ 3(5) (ఉమ్మడి ఉద్దేశంతో పలువురు వ్యక్తులు చర్యకు పాల్పడినప్పుడు స్వచ్ఛందంగా తీవ్రంగా గాయపరచడం), 190 (చట్టవిరుద్ధంగా గుమికూడటం), 132 (ప్రభుత్వ ఉద్యోగిని అడ్డుకోవడానికి నేరపూరిత బలప్రయోగం), 125(ఎ) (తప్పుడు అఫిడవిట్ దాఖలు చేయడం), 125(బి) (మానవ ప్రాణాలకు హాని కలిగించే నిర్లక్ష్యపూరిత చర్యలు) ఉన్నాయి.
బెంగళూరు తొక్కిసలాట..కోహ్లీపై పోలీసులకు ఫిర్యాదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES