- Advertisement -
నవతెలంగాణ – బెంగళూరు: రాయల్ ఛాలెంజెర్స్ జట్టు విజయోత్సవ వేడుక సందర్భంగా చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన 11 మంది కుటుంబాలకు ఆర్థిక సాయం చేసేందుకు ఆ జట్టు యాజమాన్యం ముందుకొచ్చింది. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ పేజీలో పోస్టు చేసింది. అంతేకాకుండా ఈ ఘటనలో క్షతగాత్రులైన వారికి చికిత్స కోసం ఆర్సీబీ కేర్స్ పేరిట నిధులు సేకరించాలని నిర్ణయించింది. మరోవైపు మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున కర్ణాటక ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే.
- Advertisement -