- Advertisement -
– గవర్నర్ శివప్రతాప్ శుక్లా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
శనివారం నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శుక్రవారం శుభాకాంక్షలు తెలిపారు. పరీక్షలను ఒత్తిడిగా భావించకుండా, తమ జ్ఞానం, ప్రతిభను చూపించే మంచి అవకాశంగా భావించాలని సూచించారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో, సానుకూల ధృక్పథంతో ముందుకు సాగాల న్నారు. పరీక్షల సమయంలో ప్రశాంతంగా ఉండి, సమయాన్ని సక్రమంగా వినియోగించుకుని తమ అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించాలన్నారు.
- Advertisement -



