Monday, August 25, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంప్రభుత్వాస్పత్రిలో భద్రాద్రి కలెక్టర్‌ సతీమణి ప్రసవం

ప్రభుత్వాస్పత్రిలో భద్రాద్రి కలెక్టర్‌ సతీమణి ప్రసవం

- Advertisement -

నవతెలంగాణ-పాల్వంచ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి వైద్యంపై జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి. పాటిల్‌ ప్రజలకు నమ్మకాన్ని పెంచారు. పాల్వంచలోని వైద్య విధాన పరిషత్‌ ఆస్పత్రిలో ఆయన సతీమణి శ్రద్ధ జితేష్‌ పాటిల్‌ ప్రసవించారు. చాలాకాలంగా పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రిలోనే పరీక్షలు చేయించుకుంటున్న కలెక్టర్‌ సతీమణి బుధవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. తల్లీ బిడ్డా ఆరోగ్యంగా ఉన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రిలో తన భార్య శుద్ధ పరీక్షలు చేయించుకుని ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనివ్వడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రజలు ప్రభుత్వాస్పత్రుల్లో చికిత్స చేయించుకోవాలని కోరారు. శ్రద్ధకు వైద్యం అందించిన వైద్యులకు ఆయన అభినందనలు తెలియజేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad