బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ లీడ్ రోల్స్లో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘భైరవం’. ఇప్పటికే పవర్ఫుల్ పోస్టర్లు, యాక్షన్తో నిండిన టీజర్, రెండు సూపర్ హిట్ సాంగ్స్తో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మొదటి పాట రొమాంటిక్ మెలోడీగా కాగా, రెండో సింగిల్ పవర్ ఫుల్ డివోషనల్ సాంగ్గా అందర్నీ అలరించింది. దర్శకుడు విజరు కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్పై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు. పెన్ స్టూడియోస్ అధినేత డా.జయంతిలాల్ గడా సమర్పిస్తున్నారు.
తాజాగా మేకర్స్ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఈ వేసవి సీజన్లో బిగ్గెస్ట్ ఎట్రాక్షన్గా ఈనెల 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ సినిమా విడుదల కాబోతోంది అని మేకర్స్ తెలిపారు.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ముగ్గురూ కలర్ఫుల్ ఫెస్టివల్ వైబ్తో కనిపించిన రిలీజ్ డేట్ పోస్టర్ అదిరిపోయింది. ఈ చిత్రంలో ఆదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్ళై కథానాయికలుగా నటిస్తున్నారు.
ఈ చిత్రానికి కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: విజయ్ కనకమేడల, నిర్మాత: కె.కె.రాధామోహన్, సమర్పణ: డా. జయంతిలాల్ గడా (పెన్ స్టూడియోస్), సినిమాటోగ్రఫీ: హరి కె వేదాంతం, ప్రొడక్షన్ డిజైనర్: బ్రహ్మా కడలి, ఎడిటర్: చోటా కే ప్రసాద్,
సంగీతం: శ్రీచరణ్ పాకాల, డైలాగ్స్: సత్యర్షి, తూమ్ వెంకట్, సాహిత్యం: భాస్కరభట్ల, కాసర్ల శ్యామ్, చైతన్య ప్రసాద్, బాలాజీ, తిరుపతి, ఫైట్ మాస్టర్స్: రామకష్ణ, నటరాజ్ మడిగొండ.
‘భైరవం’ రిలీజ్కి రెడీ
- Advertisement -
- Advertisement -