నవతెలంగాణ-భద్రాచలం:రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలలో ముందుగా కేక్ కట్ చేసి కార్యకర్తలకు మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు అరికల తిరుపతిరావు, భీమవరం వెంక రెడ్డిలు మాట్లాడుతూ… గత ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ భట్టి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. రానున్న స్థానిక సంస్థ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ భద్రాచలం నియోజకవర్గంలో క్లీన్ స్విఫ్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పెద్దినేని శ్రీనివాస్, అన్నం సత్యనారాయణమూర్తి, పసి శ్రీనివాస్, ఒకే రమణ, గాడి విజరు, రాజేష్, మైధిలి, తదితరులు పాల్గొన్నారు.
దుమ్ముగూడెం : భట్టి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. దుమ్ముగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కేక్ కట్ చేసి రోగులకు స్వీట్లు, పండ్లు అందజేశారు. లక్ష్మీ నగరం గ్రామంలో గల పలు ఆర్ఎంపీ వైద్యశాలలో గల రోగులకు పండ్లు అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు భట్టి విక్రమార్క అభిమానులు పాల్గొన్నారు.
టేకులపల్లి : భట్టి విక్రమార్క పుట్టినరోజు సందర్భంగా టేకులపల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జన్మదిన వేడుకలు ఘనంగా అభిమానులు ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భూక్యా దేవా నాయక్, భట్టి యువసేన అధ్యక్షులు దంతోజు నవీన్ కుమార్, ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ రసమల్లా నర్సయ్య, ఆకారపు స్వప్న, మాజీ సర్పంచ్ బోడా సరిత, కోరం హనుమంతు, ధర్మ, భూక్యా కిషన్, పాండు తదితరు పాల్గొన్నారు.
అశ్వారావుపేట : భట్టి పుట్టిన రోజు వేడుకలను అశ్వారావుపేటలో ఘనంగా నిర్వహించినప్పటికీ కాంగ్రెస్ పాత కొత్త వర్గాలుగా వేర్వేరుగా నిర్వహించారు. సీనియర్ నాయకులు మొగళ్ళపు చెన్నకేశవ రావు నేతృత్వంలో అమ్మ సేవా సదనం వృద్దులు ఆశ్రమంలో బర్త్ డే కేక్ కట్ చేసి అందులోని వృద్దులకు భోజనం వసతి కల్పించారు. ఈ కార్యక్రమంలో జ్యేష్ట సత్యనారాయణ చౌదరి, బండారు మహేష్, సెక్రెటరీ కొప్పుల శ్రీను, మాజీ సర్పంచ్ దాసరి నాగేంద్రరావు, రాజశేఖర్, సింహాచలం, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో : కాంగ్రెస్ మండల అద్యక్షులు తుమ్మ రాంబాబు నేతృత్వంలో బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ అధ్యక్షులు చిన్నంశెట్టి సత్యనారాయణ, నాయకులు సుంకవల్లి వీరభద్రరావు, జూపల్లి ప్రమోద్, తగరం ముత్తయ్య, సోషల్ మీడియా కోఆర్డినేటర్ నరదల మణికంఠలు పాల్గొన్నారు.
ఘనంగా భట్టి జన్మదిన వేడుకలు
- Advertisement -
- Advertisement -