- Advertisement -
నవతెలంగాణ-భిక్కనూర్ : భిక్కనూర్ పట్టణ కేంద్రంలోని హరిజనవాడ కాలనీలో బుధవారం పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్ల పథకం, ప్రభుత్వ పథకాలు అందుతాయని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుదర్శన్, పట్టణ అధ్యక్షుడు దయాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు లింబాద్రి, యూత్ నాయకులు కిరణ్, నాగరాజు, పంచాయతీ కార్యదర్శి మహేష్ గౌడ్, గ్రామస్తులు, తదితరులు ఉన్నారు.
- Advertisement -